Monday, 15 December 2025

రామాయణం ఎవరు రచించారు?

 బాలకాండలోని 5వ సర్గలో ఇలా ఉంది.

----

ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనామ్ ।

మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతమ్ ।।1.5.3।।

ఎందరో గొప్ప మహారాజులు  పుట్టిన ఇక్ష్వాకువంశంలో జన్మించిన రాముని చరితమే ఈ రామాయణము.

తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదిత: । 

ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా ।।1.5.4।। 


ధర్మకామార్థములను ప్రతిపాదించు ఈ రామాయణమును ప్రవర్తింపజేయుదును.  దీనిని ఎట్టి దోష దృష్టియు లేకుండ వినవలసినది.

----

ఇక్కడ తదిదం వర్తయిష్యామి - ఈ రామాయణమును ప్రవర్తింపజేయుదును అనేది గమనిస్తే, ఈ కావ్యకర్త పేరు చెప్పలేదని గమనించవచ్చును.

---

చిత్రకూటంలో శ్రీరామ, సీతా, లక్ష్మణులు వాల్మీకి ఋషిని కలసినట్లు, అయోధ్యకాండలో ఉంది.


తి సీతా చ రామశ్చ లక్ష్మణశ్చ కృతాఞ్జలిః।

అభిగమ్యాఽశ్రమం సర్వే వాల్మీకి మభివాదయన్।।2.56.16।।


పిదప సీతారామలక్ష్మణులు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకేగి, దోసిలియొగ్గి, ఆ మునీశ్వరునకు ప్రణమిల్లిరి.

---

నా సందేహం.

రామాయణ కావ్యకర్త వాల్మీకి మహర్షియే ఐతే,  సీతారామలక్ష్మణులు చిత్రకూటంలో నన్ను కలిసారు అని చెబుతారుగానీ, వాల్మీకి మహర్షిని కలిసారు అని ఎందుకు చెబుతారు?


No comments:

Post a Comment