శీర్షికను చూడగానే చాలా మందికి నవ్వు రావచ్చును, కొందరికి ఆశ్చర్యం కలుగవచ్చును.
అంతగా చదువుకోని వ్యక్తులు కూడా వెంటనే చెప్పే సమాధానం: శ్రీమద్రామాయణం మానవజాతి కోసంఅని.
ఒక ఆదర్శ ప్రభువు ఎలా ఉండాలి, ఒక మంచి కుమారుడు ఎలా ఉండాలి, ఒక మంచి తమ్ముడు ఎలాఉండాలి, ఒక ఆదర్శ భర్త ఎలా ఉండాలి, ఒక ఆదర్శ భార్య ఎలా ఉండాలి, ఒక ఆదర్శ సేవకుడు/మంత్రిఎలా ఉండాలి, ఇలా చాలా చెప్పవచ్చును.
ఈ ప్రశ్నను నాలో నేను వేసుకుని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను.
సీత తండ్రి జనక మహారాజు ఒక మంచి కుమారుడు, ఆదర్శ ప్రభువే కద! మంచి తమ్ముడుగా జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుడున్నాడు.
ఆదర్శ భార్యభర్తలను గురించి చెప్పవలసి వస్తే శ్రీరాముడి కాలం నాటికే అతి వృద్ధులైన అత్రిఅనసూయలున్నారు కద!
ఇలా చాలా మంది శ్రీమద్రామాయణంలోనే ధర్మబద్ధులైన వారున్నారు. శ్రీరాముడి కధనే ఆధారంచేసుకుని కవి చెప్పదలుచుకున్నదేమిటి?
---- ---
నాకన్నా పెద్దవారు, నాకు తటస్థపడినవారు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవారు చెప్పినదానినిబట్టి,శ్రీమద్రామాయణం ప్రజలను, తద్వారా సమాజాన్ని ధర్మబద్దమైన రీతిలో నడిచేటట్లు చేయడానికి కవివాల్మీకి రచించాడని నేను అర్ధం చేసుకున్నాను.
ఐతే కేవలం ధర్మబద్దమైన రీతిలో జీవించడమొకటే మనిషిని ముక్తుడిగా చేస్తుందా అంటేఅనుమానమే! ఎందుకంటే చాల కాలం ధర్మబద్దమైన రీతిలో జీవించినవారు కూడా, ముఖ్యంగాక్షత్రియులు అహంకారం వల్లనో, ఆశించకూడని వాటిని ఆశించడం వల్లనో, మరికొన్ని కారణాల వల్లనో,తరువాతి కాలంలో పతనమైన ఉదాహరణలు శ్రీమద్రామాయణంలోనే కనిపిస్తాయి.
ఇక్ష్వాకు వంశములో పురుకుత్సునికి సత్యవ్రతుడను పుత్రుడును కలిగారు. వీరిలో సత్యవ్రతుడుపరాక్రమవంతుడై రాజ్యాధికారము చేపట్టెను. ఈ సత్యవ్రతుడే తండ్రిమాట పాటించక మాదిగవాడదాటివచ్చుట, గోవధజేయుట, గోమాంసమును భక్షించుట యను మూడు పాపములు సలిపిత్రిశంకుడు అని నామధేయము గలిగి, వశిష్ట మహర్షిచేత శాపగ్రస్తుడౌతాడు.
శ్రీమద్రామాయణం ప్రకారం త్రిశంకు మహారాజు సత్యవాది, జితేంద్రియుడు.
ఇతనికి గొప్ప యజ్ఞములను చేసి, ఆ ప్రభావంతో దేవతలకు నివాస భూమియైన స్వర్గమునకుసశరీరముగా వెళ్ళవలెను - అని బుద్ధి పుట్టినది. అతని గురువైన వశిష్టుడు అది అసాధ్యము అనివచించెను.
శ్రీగీతా ప్రెస్ వారి వ్యాఖ్యానం ప్రకారం గురువైన వశిష్టుడికి ఆ సామర్ధ్యము లేదని కాదు, ఆ విధంగాస్వర్గమునకు వెళ్ళినవారు లేరనికాదు- త్రిశంకువుకు అట్టి అర్హత లేదని అర్ధం.
గురువైన వశిష్టుడి మాట వినకపోవడం వల్ల చివరికి అటు ఇటు గాని ఆకాశంలో ఒంటరిగాతల్లక్రిందులుగా వ్రేలాడుతు ఉండి పోయాడు.
అంతగా చదువుకోని వ్యక్తులు కూడా వెంటనే చెప్పే సమాధానం: శ్రీమద్రామాయణం మానవజాతి కోసంఅని.
ఒక ఆదర్శ ప్రభువు ఎలా ఉండాలి, ఒక మంచి కుమారుడు ఎలా ఉండాలి, ఒక మంచి తమ్ముడు ఎలాఉండాలి, ఒక ఆదర్శ భర్త ఎలా ఉండాలి, ఒక ఆదర్శ భార్య ఎలా ఉండాలి, ఒక ఆదర్శ సేవకుడు/మంత్రిఎలా ఉండాలి, ఇలా చాలా చెప్పవచ్చును.
ఈ ప్రశ్నను నాలో నేను వేసుకుని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను.
సీత తండ్రి జనక మహారాజు ఒక మంచి కుమారుడు, ఆదర్శ ప్రభువే కద! మంచి తమ్ముడుగా జనక మహారాజు తమ్ముడు కుశధ్వజుడున్నాడు.
ఆదర్శ భార్యభర్తలను గురించి చెప్పవలసి వస్తే శ్రీరాముడి కాలం నాటికే అతి వృద్ధులైన అత్రిఅనసూయలున్నారు కద!
ఇలా చాలా మంది శ్రీమద్రామాయణంలోనే ధర్మబద్ధులైన వారున్నారు. శ్రీరాముడి కధనే ఆధారంచేసుకుని కవి చెప్పదలుచుకున్నదేమిటి?
---- ---
నాకన్నా పెద్దవారు, నాకు తటస్థపడినవారు, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసేవారు చెప్పినదానినిబట్టి,శ్రీమద్రామాయణం ప్రజలను, తద్వారా సమాజాన్ని ధర్మబద్దమైన రీతిలో నడిచేటట్లు చేయడానికి కవివాల్మీకి రచించాడని నేను అర్ధం చేసుకున్నాను.
ఐతే కేవలం ధర్మబద్దమైన రీతిలో జీవించడమొకటే మనిషిని ముక్తుడిగా చేస్తుందా అంటేఅనుమానమే! ఎందుకంటే చాల కాలం ధర్మబద్దమైన రీతిలో జీవించినవారు కూడా, ముఖ్యంగాక్షత్రియులు అహంకారం వల్లనో, ఆశించకూడని వాటిని ఆశించడం వల్లనో, మరికొన్ని కారణాల వల్లనో,తరువాతి కాలంలో పతనమైన ఉదాహరణలు శ్రీమద్రామాయణంలోనే కనిపిస్తాయి.
ఇక్ష్వాకు వంశములో పురుకుత్సునికి సత్యవ్రతుడను పుత్రుడును కలిగారు. వీరిలో సత్యవ్రతుడుపరాక్రమవంతుడై రాజ్యాధికారము చేపట్టెను. ఈ సత్యవ్రతుడే తండ్రిమాట పాటించక మాదిగవాడదాటివచ్చుట, గోవధజేయుట, గోమాంసమును భక్షించుట యను మూడు పాపములు సలిపిత్రిశంకుడు అని నామధేయము గలిగి, వశిష్ట మహర్షిచేత శాపగ్రస్తుడౌతాడు.
శ్రీమద్రామాయణం ప్రకారం త్రిశంకు మహారాజు సత్యవాది, జితేంద్రియుడు.
ఇతనికి గొప్ప యజ్ఞములను చేసి, ఆ ప్రభావంతో దేవతలకు నివాస భూమియైన స్వర్గమునకుసశరీరముగా వెళ్ళవలెను - అని బుద్ధి పుట్టినది. అతని గురువైన వశిష్టుడు అది అసాధ్యము అనివచించెను.
శ్రీగీతా ప్రెస్ వారి వ్యాఖ్యానం ప్రకారం గురువైన వశిష్టుడికి ఆ సామర్ధ్యము లేదని కాదు, ఆ విధంగాస్వర్గమునకు వెళ్ళినవారు లేరనికాదు- త్రిశంకువుకు అట్టి అర్హత లేదని అర్ధం.
గురువైన వశిష్టుడి మాట వినకపోవడం వల్ల చివరికి అటు ఇటు గాని ఆకాశంలో ఒంటరిగాతల్లక్రిందులుగా వ్రేలాడుతు ఉండి పోయాడు.
No comments:
Post a Comment