Sunday, 30 August 2015

శ్రీమద్రామాయణం ఎవరి కోసం? (భాగం – 4)

చాల శక్తి ఉండి కూడా తన కన్నా బలహీనులను లేదా తనను ఆశ్రయించిన వారిని రక్షించడం అనే స్వభావాన్ని పరిశీలిస్తే శ్రీరాముని విషయాని కొస్తే వివరించి చెప్పనక్కరలేదు.  బాలకాండ నుండి యుద్ధకాండ వరకు అంతట అజేయుడిగా నిలచాడు.  పైగా ఇంద్రజిత్తును చంపవలసి వచ్చినపుడు లక్ష్మణుడు శ్రీరాముని ధర్మనిబద్ధతనుసత్యసంధతనుఅజేయత్వాన్నే ఆధారం చేసుకున్నాడు.

తన కన్నా బలహీనులను లేదా తనను ఆశ్రయించిన ఋషులనుసుగ్రీవుడువిభీషణులను ధర్మబుద్ధితో మాట ఇచ్చి కాపాడాడు.

ఆదర్శ భార్యభర్తలను గురించి చెప్పవలసి వస్తే శ్రీరాముడి కాలం నాటికే అతి వృద్ధులైన అత్రి అనసూయలున్నారు.  అత్రి మహర్షి తపోశక్తి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  అనసూయ మాత కేవలం పతివ్రత ధర్మాన్ననుసరించి జీవించిన ఇల్లాలే కాదు

10వేల సంవత్సరాలు గొప్ప తపస్సు చేసిన తపస్విని.  అసూయను జయించింది కాబట్టి ఆమె అనసూయగా పేరు గాంచింది.

ఒక సందర్భంలో 10 రాత్రులను ఒక రాత్రికి కుదించిందిఒకసారి 10 సంవత్సరాలు  తీవ్రమైన కరువు వస్తేతన తపస్సక్తితో ఫలాలనుదుంపలను సృష్టించి ప్రజలకు అందించిందిజాహ్నవి నదిని అక్కడే ప్రవహించేటట్లు చేసింది.

ఆదర్శ భార్యభర్తలను గురించి చెప్పవలసి వస్తే సీతారాములనే ఎందుకు చెబుతారు?   అత్రి అనసూయ  గురించి ఎందుకు చెప్పరు?
----------------

ఇక్కడ లోక స్వభావాన్ని కొంచెం గుర్తుచేసుకోవాలి.

ఋషులు వారి జీవన గమ్యముజీవించే విధానము మామూలు ప్రజల జీవన గమ్యముజీవించే విధానములకంటే భిన్నంగా ఉంటుంది. 

ఋషులు స్థూలంగా ధర్మబద్ధమైన జీవన విధానము గురించి చెప్పగలరుకానిమామూలు ప్రజలకు నిత్యజీవితంలో ఎదురుపడే సందేహాలకు సమాధానమివ్వడానికి వారు అందుబాటులో ఉండరు.

కందమూలాలుపళ్ళు తింటూ సర్వసంగపరిత్యాగులై ముక్తియే పరమగమ్యంగా ఉండే ఋషుల జీవితం మామూలు ప్రజలకు దూరం నుండి చూసి నమస్కరించే విధంగా ఉంటుందికానీ స్ఫూర్తిదాయకంగా ఉండదుఆచరణ సాధ్యం కాదు.

కాబట్టి వారికి అందుబాటులో ఉండివారిలాగే సంసారముపిల్లలు మధ్యలో ఉంటూధనార్జన చేస్తూఅన్ని సమస్యల మధ్యన కూడా ధర్మబద్ధమైన  జీవనం సాగించే వ్యక్తుల జీవించే విధానము వారికి స్ఫూర్తిదాయకంగామార్గదర్శనం చేసే విధంగా ఉంటుంది.

అందుకే శ్రీమద్రామాయణ కావ్య కర్తఅత్రి అనసూయల జీవితంకానివశిష్టుడు అరుంధతిల జీవితంకాని మరి వేరే ఋషుల జీవన విధానం ఎక్కువగా శ్రీమద్రామాయణంలో వివరించి చెప్పలేదు.

శ్రీ సీతారాముల జీవన విధానం ప్రజల మధ్యనప్రజల కోసముండేది.   మామూలు ప్రజలకు అందుబాటులో ఉండివారిలాగే సంసారముపిల్లలు మధ్యలో ఉంటూధనార్జన చేస్తూఅన్ని సమస్యల మధ్యన కూడా ధర్మబద్ధమైన  జీవనం సాగించిన శ్రీ సీతారాముల జీవన విధానం స్ఫూర్తిదాయకంగామార్గదర్శనం చేసే విధంగా ఉంటుంది.

No comments:

Post a Comment