శ్రీమద్రామాయణము ప్రతి సర్గ తరువాత "ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే..." అని ఉండి తరువాత కాండ, సర్గల పేర్లు ఉంటాయి.
శ్రీమద్రామాయణ కావ్య ప్రారంభంలో, బాలకాండలోని మొదటి 4 సర్గలలో తప్ప వాల్మీకే ఈ కావ్యం వ్రాసినట్లు ఎక్కడా చెప్పబడలేదు. శ్రీమద్రామాయణ కావ్య ప్రారంభంలో, బాలకాండలోని మొదటి 4 సర్గలలోను, అయోధ్యకాండలో ఒకేసారి, ఉత్తరకాండలో తప్ప వాల్మికి ప్రస్తావన కనిపించదు.
బాలకాండలో, మొదటి 4 సర్గలలో వాల్మీకే ఈ కావ్యం వ్రాసినట్లు చెప్పబడినా, అందులో శ్రీ మహావిష్ణువు గురించి కీర్తిస్తూ ఉండడం వల్లను, మరి కొన్ని కారణాల వల్లను, ఆ 4 సర్గలు ప్రక్షిప్తమని వాదన ఉంది. ఉత్తరకాండ మొత్తం ప్రక్షిప్తమని ఇదివరకే చెప్పాను.
------------
అయోధ్యకాండలో ఒకేసారి వచ్చే వాల్మికి ప్రస్తావన ఇలా ఉంటుంది. చిత్రకూట పర్వతప్రాంతానికి చేరేముందు, సీతారామలక్ష్మణులు వాల్మికి మహర్షిని కలుస్తారు.
ఇతి సీతా చ రామశ్చ లక్ష్మణశ్చ కృతాంజలి: |
అభిగమ్యాశ్రమం సర్వే వాల్మీకిం అభివాదయన్ ||
(అయోధ్యకాండము - 56వ సర్గ 16వ శ్లోకము )
"పిదప సీతారామలక్ష్మణులు వాల్మికి మహర్షి ఆశ్రమమునకేగి, దోసిలియొగ్గి, ఆ మునీశ్వరునకు ప్రణమిల్లిరి."
తాన్మహర్షి: ప్రముదిత: పూజయామాస ధర్మవిత్ |
ఆస్యతామితి చోవాచ స్వాగతం తు నివేద్య చ || (అయోధ్యకాండము - 56వ సర్గ 17వ శ్లోకము )
"ధర్మాతుడైన వాల్మికి మహర్షి సీతారామలక్ష్మణులరాకకు మిగుల సంతసించి, ''మీకు స్వాగతము,విచ్చేయుడు, ఆసీనులుకండు", అని పలుకుచు వారికి ఆదరసత్కారములను నెఱపెను."
-----------------
No comments:
Post a Comment