Sunday, 18 June 2023

శ్రీరాముడి సత్యపాలన

 

అనేకమంది ఋషులు సవితృ గురించి అన్నింటికి మూలం, సర్వస్వతంత్రుడుగా, పురుషశక్తిగ ఋగ్వేదంలో చెప్పారు.  స్త్రీశక్తి పరంగా దేవమాత అదితిని స్తుతించారు.

భౌతికంగా సవితృ ఆరాధన అంటే, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడికి ఉదయిస్తూండగ/అస్తమిస్తుండగ అర్ఘ్యం ఇవ్వడం, సావిత్రీమంత్ర జపం చేయడం ప్రాచుర్యంలో ఉంది.

అదే ఋగ్వేదంలో సోమరసం గురించి ప్రస్తావన ఉంటుంది.  9వ మండలం మొత్తం (అనేకమంది ఋషులు కూర్చిన 114 సూక్తాలు)  అన్నింటిని పునీతం చేసే సోమం గురించే -  pavamānaḥ somaḥ   ఉంటుంది. 

----------

ఋగ్వేదం తరువాత వచ్చిన చాలమంది సాధకులు, నేటి కాలానికి సంబంధించిన    అనేకమంది సాధకులు, పాశ్చాత్య ఋగ్వేద   అనువాదకులు, ఈ సోమరసాన్ని భౌతికంగ దొరికే ఒక తీగ రసమని వ్రాసారు.


శ్రీ అరవింద యోగి వంటివారు ఈ సోమరసాన్ని భౌతికంగ దొరికే ఒక తీగరసమనికాక, సాధకుడు  ఆధ్యాత్మికంగ  అత్యున్నతస్థాయిని చేరినపుడు కలిగే ఆత్మసాక్షాత్కారం  తాలుకు దివ్య అనందాన్ని, అన్నింటిని పునీతం చేసే సోమంగా చెప్తారు.

---------

ఆధ్యాత్మికపరంగ చూస్తే, సూర్యుడు/సవితృ అనుగ్రహాన్ని పొందడం ఆత్మసాక్షాత్కారంగా భావిస్తే, తత్ఫలితంగా లభించే దివ్యానందాన్ని సోమరసాన్ని త్రాగడంగ భావించవచ్చును.

ఈ సోమాన్ని సూర్యుడి కుమార్తెగ - సూర్యస్య దుహితా - ప్రస్తుతించారు.

పునాతి తే పరిస్రుతం సోమం సూర్యస్య దుహితా । వారేణ శశ్వతా తనా ॥ (ఋగ్వేదం 9.1.6)

---------

అన్నింటిని పునీతం చేసే ఈ సోమం, సత్యాన్వేషణ  చేసేవారిని అనుగ్రహిస్తుందని ఋగ్వేదం చెబుతోంది.

ఏష దేవో విపన్యుభిః పవమాన ఋతాయుభిః । హరిర్వాజాయ మృజ్యతే ॥ 

(ఋగ్వేదం 9.3.3)

ఋతం అంటే సత్యం అని.

---------

అంటే, ఆధ్యాత్మికంగ ఎదగాలన్నా, ఆత్మసాక్షాత్కారం అనుభవించాలన్నా, సాధకుడు సత్యానికి కట్టుబడి ఉండాలని ఋషులు చెబుతున్నారు.






ఇదే విషయాన్ని వాల్మికి మహర్షి శ్రీరాముడు  సత్యవంతుడు, ధర్మాత్ముడు అని చెప్పడంవల్ల, సాధకులకు సత్యపాలన ప్రాధాన్యం గురించి చెప్పారు. 

ధర్మజ్ఞః సత్యసన్ధశ్చ శీలవాననసూయకః |

క్షాన్తః సాన్త్వయితా శ్లక్ష్హ్ణః కృతజ్ఞో విజితేన్ద్రియః ||

No comments:

Post a Comment